Friday 11 September 2015

1.108 సంఖ్యా ప్రాముఖ్యత

108 - సంఖ్యా ప్రాముఖ్యం.!!

"" ఏకమ్ సత్ విప్రా బహుదా వదంతి ""
"సత్యం ఒక్కటే" , జ్ఞానులు దానిని బహు విధాలుగా చెప్తారు.

ఈ నిజాన్నే భారతీయ విజ్ఞానం సర్వదా ప్రతిధ్వనిస్తూ ఉంది. అసలు సత్యమేదనగా, సృష్టి భగవంతుని ఆవిష్కరణ, సృష్టి భగవంతునిలోనే ఉంది.ఆ సృష్టి చివరకు భగవంతునిలోనే లీనమౌతుంది.

స్వర్గం,పాలపుంత,గ్రహలు,నక్షత్రాలు,మానవులు, ఇతర జీవమూలమూ ఆ భగవంతుడిచే సృష్టించబడింది.
ఆయనలోనే ఉన్నది. చివరకు ఆ దివ్య సూత్రంలోనే లీనమౌతుంది.ఈ విశ్వంలో ఒక లయ,ఒక కూర్పు,ఒక సమన్వయం ఉంది.ఈ విషయం ప్రాచీన భారతీయులకు తెలుసు.!!

సంభ్రమమైన 108 సంఖ్య ప్రాఛీన భారతీయులకు చాలా పవిత్రమైనది.

అన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ 108 అనే సంఖ్యకు వారు చాలా ప్రాముఖ్యతనిచ్చారు.

దేవుని/దేవతను మంత్ర పుష్పాలతో పూజిస్తూ - 108 పవిత్ర పూసలు గల జపమాలలను గణిస్తూ జపం చేసేవారు.

108 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో హిందువులే కాదు, బౌద్దులు,జైన్నులు,సిక్కులు,టోయిన్లు వంటి వారందరూ గుర్తించారు. తనలోని దైవత్వాన్ని గ్రహించడానికి ఆత్మ 108 మెట్లు దాటాలని వీరి నమ్మకం. ఆ సంఖ్య భగవంతునికీ భక్తునికీ మధ్య అనుసంధాన కారకమని భారతీయుల నమ్మకం.

వేద ఋషులు ఖగోళ శాస్ర్తానికి సంభందించిన గణనలో………

* భూమికి,చంద్రునికి మధ్య దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.
* భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.
* సూర్యుని యొక్క వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు అనీ నిర్ధారించారు.

ఈ వేదగణన ఆధునిక సాంకేతిక విశ్వగణనలో లభించిన భూమికీ,చంద్రునికీ,భూమికీ సూర్యునికీ ఉన్న దూరంలో దాదాపు సరిపోయింది.

ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలను గుర్తించింది.108 అనే మర్మాల గొలుసులో 107 గ్రంధులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది.

ఇవి జీవచెతన్యం మానవ శరీరంలో మిళితమయ్యే కేంద్ర స్థానాలు, ఈ మర్మస్థానాల ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది.

భారతీయ యోధునికి పై చెప్పబడిన "మర్మస్థానాలు" తెలిసే ఉంటాయి. అతడు యుద్దం చేసే సమయంలో శత్రువును ఆ "మర్మ స్థానాలపై" దాడిచేసి సంహరిస్తాడు.

అలాగే పవిత్రమైన శ్రీ చక్రయంత్రంలో 54 స్ర్తీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. వీటి మొత్తం 108.

జోతిష్య శాస్ర్తం, మానవ ప్రవృత్తికి సంభందించి బ్రహ్మండాన్ని 27 చంద్ర సూచికలైన నక్షత్రాలతో, ఒక్కో నక్షత్రం తిరిగి 4 పాదాలతో ఉంటుందని గుర్తించిందని. ఇది 27*4=108 పాదాలయింది. అవే 108 ప్రాథమిక మానవ ప్రవృత్తులు. శిశు జనన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడో, దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో, వృత్తిలో, ఆనందంలో, కుటుంబంలో, చివరకు మోక్ష మార్గంలోనూ ప్రతిఫలిస్తుంది.

* భారతీయ జ్యోతిష్యంలో 12 రాశులు, 9 గ్రహలు ఉంటాయి. 12*9=108.

* మానవుడు సగటున ప్రతి రోజూ 21,600 సార్లు శ్వాస తీస్తాడు. అందు 10,800 సూర్యాంశ, 10,800 చంద్రాంశ…
108 ని 100 తో గణిస్తే…
10,800 వస్తుంది. దీనిని 2తో గుణిస్తే…
21,600 వస్తుంది అని తంత్ర శాస్ర్తం చెబుతుంది.

* భరతుడు -తన "నాట్యాశాస్త్రం" లో చేతులు, కాళ్ళూ కలిపి చేసే నాట్యభంగిమల మొత్తం సంఖ్యను 108 గా గుర్తించారు. వీనిని . "కరణ" ములంటారు.

* 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, భగవద్గీతలో 18 అధ్యయనాలు, ఎన్నో ప్రముఖ సంస్కృత గ్రంథాలలో 108 శ్లోకాలు ఉంటాయి. హిందువులు నిత్యమూ పూజచేసే విధానంలో అష్టోత్తర పూజ, అష్టోత్తర శత నామావళి వంటివి ఉంటాయి. చాలామంది సిద్దులు తమ తమ పేర్లకు ముందు 108 గానీ, 1008 గానీ ఉంచుకునే సాంప్రదాయం ఉంది.

* సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వీటిని శివ, శక్తి తత్వాలైన స్ర్తీష.పురుష రూపాలుంటాయి.
అనగా 54*2=108

* భారతీయ కాలగమణ ప్రకారం బ్రహ్మకు ఒక రోజు అంటే 4 యుగాలు కలిసిన 44,20,000 సంవత్సరాలు.
ఇది 108 అనే సంఖ్యతో భాగింపబడుతుంది.

* సంఖ్యా శాస్ర్తంలో 108ని 1+0+8=9 గా రాస్తారు. ఒక సంఖ్యను 9తో గణించి వచ్చిన సంఖ్యను కూడగా తిరిగి 9 వస్తుంది.

* గణితంలో 108 అనగా 1*2(sequre2) *3(squre3) =108 వస్తుంది.

ఇంతటి వైవిష్టం గల 108 సంఖ్య ఎంతో దివ్యమైనది. అది సృష్టికర్తకు, సృష్టికి అనుసంధానం కలిగించేదిశ అందుకే మన ఋషులు, పురాణాలు, వేదాలు, భారతీయ సంస్కృతి 108 సంఖ్యకు ఇంతటి పవిత్రత ఇస్తున్నది. ఈ "భారతీయ ప్రతిభా విశేషాలు -108 నిజాలు" రాసే ప్రయత్నం కూడా దైనికంశ
భగవంతుడి ప్రేరణ అని భావించి ఈ విశ్వంలో లయబద్ద గమనంలో భాగమని మేం భావిస్తున్నాం.

No comments:

Post a Comment