Saturday 12 September 2015

నాగ జాతి జననం

నాగ జాతి జనము :
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు ..
అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు ,
కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు ,
ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన
వారినల్లా కాతువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .
దాంతో సకల దేవతలు అంటా బ్రహ్మను వేడుకోగా
ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని
శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత
ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ
విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .
"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ
కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా '
నిష్కారణం గా ఏ ప్రాణినీ హిమ్సించరాడు . గరుడ
మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను
తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు ,
జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి .
వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా
ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని
బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను
శిరసావహించారు .
దాంతో డేవాగానామంతా నాగులను ప్రశంసించారు . భూలోక
వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య
ప్రభావ సంపన్నమయిన నాగజాతికి
కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన
నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు
పెట్టారు .
వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి
ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది .
పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి ,
అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా
సమర్పిస్తారు .
పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా
పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు
నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ
నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను
గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.
చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి
రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ
వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును
చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల
పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ,
గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము,
పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని
పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు
నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం.
ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు
జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి
చెందినదేనని పండితులు అంటున్నారు.
వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పానువు .
వాసుకి పరమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు
నాగ యజ్ఞోప వీతుడు .
నాగ పంచమి వ్రత కద :
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ...
ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు
వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో
ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు
వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని
"అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు
పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ
జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి
నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల
భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి
ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది .
నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .

No comments:

Post a Comment